కరోనా అప్డేట్: దేశం లో వేగంగా పెరుగుతున్నకరోనా కేసులు.. 24 గంటల్లోనే 1463 కేసులు!!!

కరోనా కేసులు దేశంలో నానాటికి పెరుగుతూనే ఉన్నాయ్. ఇవాళ మూడు గంటల క్రితం 1211 కేసులు నమోదు అవ్వగా ఇప్పుడు ఆ సంఖ్యా వేగంగా పెరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 1463 కి పెరిగాయి. అయితే ఈ సంఖ్య గడచిన 2 గంటల్లో దాదాపుగా 252  కి పెరిగింది. దేశం మొత్తం మీద ఇప్పటివరకు 353 మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో 10815 కేసులు నమోదు అయ్యాయి .

 

 

 వీరిలో 9272 మంది చికిత్స పొందుతుండగా మరియు 1190 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే దేశంలో మహారాష్ట్ర హాట్ స్పాట్ గా తయారైంది. నిన్నటివరకు 126 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మహారాష్ట్రలో 2466గా ఉంది అయితే ముంబైలో 1540  కేసులతో దేశాన్ని హడలెత్తిస్తోంది. గడచిన 4 రోజుల నుండి నమోదవుతున్న కేసులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తోంది. ఆ తరువాత స్థానంలో 1500 కేసులతో రెండో స్థానంలో ఉంది, ఆతరువాతి స్థానంలో తమిళ నాడు ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: