కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ తో నల్గొండ జిల్లా బత్తాయి రైతుల కష్టం తీరింది. బత్తాయి సరుకు దేశ రాజధాని ఢిల్లీ చేరే విధంగా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా బత్తాయి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాయలు రాలి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. 

 

ఇక కొన్ని వేల ఎకరాల్లో పంట అందుబాటులోకి వచ్చినా సరే దాన్ని అమ్మే పరిస్థితి లేదు. దీనితో జోక్యం చేసుకున్న కిషన్ రెడ్డి దాన్ని ఢిల్లీ మార్కెట్ కి తరలించడానికి గాను ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: