హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లోని రమ్మనస్ పురా లో ఒకే కుటుంబానికి చెందిన 16 మందికి కరోనా పాజిటివ్ రావడం నగరం లో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓల్డ్ సిటీ ప్రాంతనంతటిని కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు . ఎక్కువగా మర్కజ్ నిజాముద్దీన్ జమాత్ మత పరమైన ప్రార్థనల అనంతరం తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పోజిటివ్ కేసులు నమోదు కావడం పెరిగిపోయాయి. అయితే రమ్మనస్ పురా అంతా కూడా హై ఎలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పుడు మరో ఐదు పాజిటివ్ లక్షణాలున్న కేసులు కూడా వచ్చి చేరే అవకాశం వుంది.

 

అయితే ఇప్పటికే పాజిటివ్ వచ్చిన 16 మందిని హుటాహుటిన గాంధీ హాస్పిటల్ కి తరలించారు . ఇంకా పదిమందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు . ఈ ప్రాంతం నుండి ఒక మరణం సంభవించడం జరిగింది. రమ్మనస్ పురా మొత్తంకుడా అష్టదిగ్బంధం లో ఉంచారు .ఈ ప్రాంతం లో వారికీ నిత్యావసరాలను ghmc సిబ్బంది అందిస్తోంది. కానీ విశేషం ఏమిటంటే ఈ కేసులు అన్ని కూడా ఎటువంటి విదేశస్తులనుండి గాని మర్కజ్ నిజాముద్దీన్ వంటి సంఘటనలతో సంబంధం లేదని ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: