ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయినా సరే సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ఆపడం లేదు సిఎం వైఎస్ జగన్. తాజాగా ఆయన మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1400 కోట్లు జమ చేయాలని జగన్ గారు ఆదేశించారని విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 

 

90.37 లక్షల మంది మహిళలు తక్షణం ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఏదైనా హామీ ఇస్తే ఎంత త్వరగా నెరవేర్చాలా అని జగన్ గారు ఆరాటపడతారని... ఎలా మోసగించాలా అని చూడటం బాబు నైజమని ఆయన అన్నారు. ప్రజలకు ఆ తేడా అర్థమైందని ఆయన ట్వీట్ చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: