పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణ మొద‌లు పెట్టాన‌ని, త‌న‌కు తోడుగా సినీ నిర్మాత  మనీష్‌ ముంద్రా, ఫోటోగ్రాఫర్‌ అతుల్‌ కస్‌బేకర్‌ ఉన్నార‌ని బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ పేర్కొంది.   క‌రోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోసం వెయ్యి పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు  విద్యాబాలన్ తెలిపారు.


 
ఈమేర‌కు తన ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోలో.. ' కోవిడ్‌-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా రోగుల‌తో వైద్యులు క్షణం తీరిక లేకుండా కాలం గ‌డుపుతున్నారు. వీరిలో ప్రాణాంత‌క వైర‌స్ ఒక్కరికి సోకినా అది పెద్ద ప్రమాదానికి తీస్తుంది. దీం తో పాటు క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుప‌త్రులు నిండిపోతాయి. మన కోసం ఇంత చేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలిపారు. 'రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు' అంటూ విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: