లాక్ డౌన్ కారణంగా దేశంలో క్రైం రేటు పడియింది అన్న వాళ్లకు ఈ ఘటన చెంప పెట్టు. దేశంలో మహిళలకు రక్షణ లేదు అనడానికి ఈ దుర్ఘటన నిదర్శనం. లాక్ డౌన్ కారణంగా తనకొడుకుని చేరుకోవడానికి మార్గమధ్యం లో ఆశ్రయం కోరిన ఆ మహిళకు స్వయానా ఓ రక్షకభటుడు ఆమెపై కామవాంఛలు తీర్చుకున్న దుర్ఘటన మాధోపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దాదాపు 40 సంవత్సరాలు ఉన్న ఆ మహిళ రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న కొడుకును చూడడానికి లాక్ డౌన్ విధించక మునుపు అక్కడకు కొడుకును చూడడానికి వెళ్ళింది. అయితే లాక్ డౌన్ కారణంగా బస్సులు మరియు వాహనసదుపాయం లేకపోవడంతో కాలినడకన బయలుదేరింది.

 

40 సంవత్సరాల ఆమె కొడుకు ఓ కేసువిషయంలో రాజస్థాన్ లోని జైపూర్ లో జైలు లో శిక్ష పొందుతున్నాడు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ వ్యక్తిని వేరే జైలు కు మార్చడంతో. ఆ కొత్త జైలు వద్దకు తన కొడుకుని కలవడానికి కాలినడకన బయలుదేరింది. మాధోపూర్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఆ మహిళ అయోమయానికి గురైయ్యింది. మాధోపూర్ ప్రాంతంలోని పెద్దల సహాయంతో పంచాయతీ లో ఆమెకు స్థానిక పాఠశాలలో ఉండమని తీర్మానించారు. అయితే ఆ సందర్భంలో అక్కడ ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. అయితే ఉరి పెద్దలందరూ ఆమెకు స్థానిక స్కూల్ లో ఆశ్రయం పొందేందుకు అనుమతి సదరు పోలీసునుండి పొందారు. అయితే ఆ మహిళ పై వ్యామోహం పెంచుకున్న ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

 

 

అతను అఘాయిత్యం చేసిందే కాకుండా తన స్నేహితులను కూడా పిలిచి వారితో కూడా అఘాయిత్యం చేయించేవాడు..ఇలా నిస్సహాయంగా ఉన్న ఆ మహిళపై పలుమార్లు అఘాయిత్యానికి పాలపడ్డారు. బయటికి చెబితే చంపేస్తామని చెప్పడం జరిగింది. ఇలా రోజు వారు అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో భయపడిన ఆ మహిళ ఆ ఊరి పెద్దలకు ఆ విషయాన్నీ చెప్పి వాపోయింది. విషయాన్నీ తెలుసుకున్న ఆ గ్రామస్తులు అతనిపై కేసు పెట్టించారు. అధికారులు ఆ పోలీసును విధులనుండి తప్పించారు మరియు అతని ఇద్దరి స్నేహితులను పరారీలో గాలిస్తున్నారు ....

మరింత సమాచారం తెలుసుకోండి: