సంచలన దర్శకుడు రాజమౌళి ఎప్పడూ వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటారు. అయితే ఇటీవల ఆయనకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఇబ్బందులకు గురవుతున్నారట. ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ కు జోడీగా డైసీ అనే హాలీవుడ్ నటిని ఎంపిక చేశారు. ఆమె మొదట ఒప్పుకొని ఆ తరువాత హ్యాండ్ ఇవ్వడంతో రాజమౌళి టీంకు ఘోర అవమానకరమైంది. ఆ షాక్ నుంచి కోలుకొని కొత్త హీరోయిన్ తో షూటింగ్ చేశాకే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మధ్యలో ఎన్టీఆర్ కు, రాంచరణ్ కు గాయాలు కావడంతో షూటింగ్ వాయిదా పడింది. వారు కోలుకొని షూటింగ్ మొదలు పెట్టే సమయానికి లాక్ డౌన్ మొదలైంది. ఇప్పటికే హీరోల గాయం కారణంగా జూలైకి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ను సంక్రాంతికి వాయిదా వేశారు. ఇప్పుడు కరోనాతో సినిమాను మళ్లీ వేసవికి పోస్ట్ పోన్ చేశారట. ఇవన్నీ చాలవన్నట్టు రాజమౌళి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. నాలుగు ఆస్కార్ అవార్డులు పొందిన కొరియన్ చిత్రం ‘పారాసైట్’ తనకు అ స్సలు నచ్చలేదని చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే నిద్రవచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. అయితే రాజమౌళి వ్యాఖ్యలపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆ సినిమాను అవమానిస్తావా అంటూ మండిపడుతున్నారు.