కరోనా వైరస్ కట్టడిలో ప్లాస్మా చికిత్స అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కరోనా కట్టడి చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అటు వైద్యులు కూడా ఈ విషయంలో దూకుడు పెంచారు. తాజాగా ఢిల్లీ కి చెందిన అనూజ్ శర్మ అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసే వాళ్లకు ఒక పిలుపు ఇచ్చారు.
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆయన ఎవరూ కూడా ప్లాస్మా దానం చేయడానికి భయపడవద్దని విజ్ఞప్తి చేసారు. ప్లాస్మా దానం 45 నిమిషాల్లో పూర్తయిందన్నారు ఆయన. ప్లాస్మా దానం చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చంటే... ప్రతీ ఒక్కరూ ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని అనూజ్ శర్మ విజ్ఞప్తి చేసారు.