దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన  పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  స్వయంగా సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్యాస్ లీకేజీ ఘటన బాధితులందరికీ భరోసా ఇస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే  ఈ గ్యాస్ లీకేజీ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. కంపెనీ చెల్లించిన చెల్లించకుండా తాము ఈ పరిహారం చెల్లిస్తామని అంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన  బాధితులకు ఉద్యోగ భద్రత కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఎల్జీ  పాలిమర్స్ కంపెనీలో బాధిత కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని తాజాగా ఒక ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: