కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకుని రావడానికి గానూ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రత్యేక కార్యక్రమం వందే భారత్ మిషన్ లో భాగంగా హైదరాబాద్ కి నేడు తొలి ఫ్లైట్ రానుంది. భారత పౌరులతో నాలుగు విమానాలు మన దేశానికి రానున్నాయి. 

 

బంగ్లాదేశ్ రాజధాని డాకా నుంచి ఢిల్లీ వరకు మధ్యాహ్నం మూడు గంటలకు విమానం వస్తుంది. గల్ఫ్ దేశం కువైట్ నుంచి సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాలకు ఒక విమానం వస్తుంది. అలాగే మస్కట్ నుంచి కొచ్చిన్ కి ఒక విమానం సాయంత్రం 8 గంటల 50 నిమిషాలకు వస్తుంది. షార్జా నుంచి లక్నో కి కూడా అదే సమయంలో విమానం రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: