ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం విషయంలో కీలక అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో నిర్ణయం దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచి మద్యం అమ్మకాలను తగ్గించిన ఏపీ సర్కార్... ఇక మద్యం కోసం కార్డులను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉంది. ఇక మరో 25 శాతం మద్యం ధరలను పెంచే విధంగా అడుగులు వేస్తుంది ఏపీ సర్కార్. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: