హైదరాబాద్ ఎల్బీ నగర్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. నగర శివారుల్లో ఉండే ఎల్బీ నగర్ లో ఇప్పటి వరకు 57 కరోనా కేసులు నమోదు కాగా 44 మందికి చికిత్స జరుగుతుంది 5 మంది మరణించారు. కొందరు డిశ్చార్జ్ అయ్యారు. 

 

హైదరాబాద్ లో నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువగా అక్కడే నమోదు అవుతున్నాయి. దీనితో ఎల్బీ నగర్ మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూడాలని అధికారుల నుంచి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. కేసీఆర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: