ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూనే ఉంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు 50 కేసులు నమోదు అయ్యాయి ఏపీలో. ఇక విశాఖ విషయానికి వస్తే అక్కడ తగ్గినట్టే తగ్గిన కరోనా మరింత వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. అక్కడ తాజాగా హోం గార్డ్ కి కరోనా సోకింది. 

 

దీనితో ఇప్పుడు పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఆమె కాంటాక్ట్స్ ని ఇప్పుడు లాగుతున్నారు. ఆమె పని చేసే స్టేషన్ పరిధిలో అందరిని కూడా హోం క్వారంటైన్ కి పంపే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాగా విశాఖలో 63 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదు అవడంతో ప్రభుత్వం జాగ్రత్త పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: