ఇండియన్ సిలికాన్ వ్యాలీ గా చెప్పుకునే హైదరాబాద్ లో నేటి నుంచి ఐటి కంపెనీలు మొదలు కానున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత నేడు ఐటి కంపెనీలు తెరుచుకున్నాయి. దీనితో ఐటి కారిడార్ లో రద్దీ మొదలయింది. మార్చ్ 4 న మైండ్ స్పేస్ లో తొలి కరోనా కేసు మొదలయింది. 

 

ఇప్పుడు సామాజిక దూరం పాటించే విధంగా ఐటి కంపెనీ లను కేంద్రం సూచనలతో నడుపుతారు. మైండ్ స్పేస్ లో తొలి కరోనా కేసు వచ్చిన నాటి నుంచి వర్క్ ఫ్రం హోం చెయ్యాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కార్యాలయాలు తెరుచుకోవడం తో ఉద్యోగులు క్యూ కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: