ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఏ స్థాయిలో ఆదరణ ఉంటుందో అందరికి తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఇక్కడ ఉత్సవాలను చూడటానికి భక్తులు తరలి వస్తు ఉంటారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలను రద్దు చేసే ఆలోచనలో ఖైరతాబాద్ ఉత్సవ కమిటి ఉందని తెలుస్తుంది. కరోనా ప్రభావం కారణంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

ఈ ఏడాది విగ్రహ తయారి విషయంలో ఒక్క అడుగు మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకున్న కమిటీ... ఈ నెల 18 న జరిగే విగ్రహ తయారి కర్ర పూజా కార్యక్రమాన్ని రద్దు చేసారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఇప్పుడు ఉత్సవాలను రద్దు చేసి ఒక చిన్న విగ్రహం... అది కూడా ఒక్క అడుగులోనే ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ నెల 18న ఉత్సవ కమిటి సమావేశం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: