విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ బాధితులకు నగదు పరిహారం పంపిణి చేస్తుంది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున మంత్రులు పరిహారం అందించారు. నేటి నుంచి బాధిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయలను పంపిణి చేస్తారు. 

 

ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసారు. బాధిత గ్రామాల్లో నివాసం ఉండే ప్రతీ ఒక్కరికి రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి అందిస్తామని చెప్పారు. జగన్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, భవిష్యత్తులో ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రజలు భయపడవద్దని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: