టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కెరీర్ లో అత్యంత చెత్త మ్యాచ్... శ్రీలంకపై 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో కీలక వికెట్లు పడుతున్న సమయంలో యువరాజ్ బ్యాటింగ్ కి రాగా అతని మీద టీం చాలా ఆశలు పెట్టుకుంది. కాని వాటిని అతను అందుకోలేదు. ఆ తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

 

అయితే ఆ రోజు పరిస్థితులను యువరాజ్ గుర్తుకు చేసుకున్నాడు. తనను అప్పుడు అందరూ నేరస్థుడి మాదిరి చూసారు అని, తాను ఆ రోజు అనుకున్న స్థాయిలో ఆడలేదు అని చాలా రోజులు బాధ పడ్డాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత తాను విమానాశ్రయం లో దిగితే మీడియా కళ్ళు అన్ని తన మీదే ఉన్నాయని, ఆ మ్యాచ్ తర్వాత కొందరు తన ఇంటిపై రాళ్ళ దాడి చేసారు అని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: