ఇప్పుడు దేశ వ్యాప్తంగా వలస కూలీలు సొంత ఊర్లకు వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి వందల కిలోమీటర్లు రోజుల తరబడి నడుస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం వారికోసం శ్రామిక్ పేరుతో ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది. 

 

అయితే దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో వలస కార్మికులకు కరోనా సోకుతుంది. ఇక విదేశాల్లో ఉన్న వలస కార్మికులు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ కేంద్ర విదేశాంగ శాఖ కు లేఖ రాసారు. కువైట్ లో చిక్కుకున్న వలస కార్మికులను తిరిగి తీసుకుని రావడానికి అవసరమైన విమానాలను ఏర్పాటు చెయ్యాలని, విజయవాడ, తిరుపతి, విశాఖ కు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: