దేశ వ్యాప్తంగా ఇప్పుడు మద్యం అమ్మకాలు మొదలైన సంగతి తెలిసిందే. దీనితో పెద్ద ఎత్తున ప్రజలు అందరూ కూడా మద్యం కోసం పోటీ పడుతున్నారు.  అయితే హైదరాబాద్ లో మాత్రం జనాలు ధర ఎక్కువగా ఉన్న మద్యం వైపు చూడటం లేదని అంటున్నారు. డబ్బుల కొరత ఉండటం తో తక్కువలో మద్యం కొనుగోలు చేస్తున్నారు జనాలు. 

 

తాజాగా బయటకు వచ్చిన లెక్కల్లో ఒక విషయం తెలిసింది. ఎక్కువగా హైదరాబాద్ లో చీప్ లిక్కర్ ని విక్రయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 6 న మద్యం షాపులు తెరుచుకోవడంతో ధరలను కూడా పెంచారు. మే నెలలో దాదాపు 25 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు మద్యం కొనుగోలు చేసే వారు ఎక్కువగా ధర తక్కువగా ఉన్న చీప్ లిక్కర్ ని అడుగుతున్నారని దీనితో దాని కొరత ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: