చిన్న సన్నకారు రైతులకు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామని నిర్మలా సీతారామన్ అన్నారు. 20 లక్షల కొట్లలో రెండో ప్యాకేజిని నిర్మల ప్రకటించారు. ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి ఈ ప్యాకేజిని ఆమె ప్రకటించారు. వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదు అని ఆమె పేర్కొన్నారు. 

 

25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను ఇది వరకే ఇచ్చామని నిర్మల అన్నారు. వీధి వ్యాపారస్తులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. 3 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీ కే రుణాలు ఇస్తున్నామని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయానికి కేంద్రం అండగా ఉంటుందని రైతులకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: