దేశ వ్యాప్తంగా మావోలకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బలహీనపడిన మావోయిస్ట్ లు ఇప్పుడు వరుస పోలీసు కాల్పులతో మరింతగా ఇబ్బంది పడుతున్నారు. లొంగు బాట్ల తో పాటుగా వరుస కాల్పులు మావోలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. 

 

తాజాగా ఝార్ఖండ్ లో భారీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక కీలక మావో నేత హతమయ్యాడు. ఈ రోజు ఉదయం సిమ్‌దేగా జిల్లాలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక నక్సల్ మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. మరో మావో తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో భారీగా గాలింపు చర్యలను చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: