వలస కార్మికుల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. వలస కార్మికులపై డ్రామాలు ఆడుతుంది మీరా మేమా అని ఆమె ప్రశ్నించారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులను ఆపి మాట్లాడటం కంటే వారి లగేజి మోస్తే తెలుస్తుంది అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. 

 

వలస కార్మికుల విషయంలో తాము అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాం అని ఆమె స్పష్టం చేసారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వలస కార్మికుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి అనవసర ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ వలస కార్మికుల మీద కూడా రాజకీయాలు చేస్తుంది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: