హా అవును అవును మీరు చదివింది నిజమే. ఇక నుంచి రెండు టీం ఇండియాలు. అదేంటి అంటారా...? హా ఏమీ లేదు. కరోనా వచ్చింది కదా... అందుకే లాక్ డౌన్ అయిన వెంటనే ఇప్పుడు మన దేశం చాలా దేశాలతో క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ లు అడుగుతుంది. శ్రీలంక వన్డే మ్యాచ్ లు టి20 మ్యాచ్ లు ఆడదాం మా దేశం రండి అంటుంది. 

 

అటు వెస్టిండీస్ కూడా మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం బాబో... మా దేశానికి మీరు రండి అంటుంది. అందుకే ఇప్పుడు టెస్ట్ ఆటగాళ్ళు అందరిని ఆస్ట్రేలియా పంపి, త్వరగా త్వరగా శ్రీలంక కు మరో టీం ని పంపి వాళ్ళతో ఆడేసి ఆ తర్వాత వెస్టిండీస్ వెళ్ళాలి అని చూస్తుంది. త్వరలోనే దీనికి మన వాళ్ళు శ్రీకారం చుడతారని అంటున్నారు. గంగూలీ ఇప్పటికే ఈ అభిప్రాయానికి కార్యరూపం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: