కేబినేట్ సమావేశం అనంతరం తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియా తో మాట్లాడారు. ఇక కేంద్రం ప్రకటించిన ప్యాకేజి పై కేసీఆర్ పెదవి విరిచారు. ఇక ఈ సందర్భంగా విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ స్పందించారు. గోదావరి జలాల, కృష్ణా జలాల విషయంలో విలేఖరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ తనదైన శైలిలో కేసీఆర్ సమాధానం చెప్పారు. 

 

త‌మ్ముడూ నీ కిరికిరి పంచాయ‌తీలు ఆపు... నా‌తో పెట్టుకోలేవ్‌... అంటూ విలేఖరి ఒక ఇబ్బందికర ప్రశ్నకు కేసీఆర్ ఘాటుగా స్పందించారు. అనవసర ప్రశ్నలు అడగవద్దు అని తమకు అంతా తెలుసు అన్నారు. కేంద్రం తో పోరాటం గురించి అడిగిన ప్రశ్నకు గానూ ఈ విధంగా కేసీఆర్ స్పందించారు. నీ ఉద్దేశం నాకు అర్ధమైంది అని తాను అంతా కుండబద్దలు కొట్టి చెప్తున్నా అంటూ సమాధానం ఇచ్చారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: