రెండు నెలల నుంచి శ్రీవారి దర్శనాలు లేకపోవడం బాధాకరమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనం లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఆయన. అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీడీ లడ్డు ప్రసాదాన్ని కేవలం 25 రూపాయలకే అందిస్తామని ఆయన పేర్కొన్నారు. 

 

శ్రీవారి దర్శనం ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు అందరికి లడ్డూ ప్రసాదాలకు రాయితీ కింద అందిస్తామని కేంద్రం ఓకే చెప్తే తాము ధర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని పక్కాగా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కాగా తొలుత రోజుకి 5 వేల మందితో శ్రీవారి దర్శనం ప్రారంభించాలని బోర్డ్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: