ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అంటూ సీఎం జగన్ గారు అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నావా బాబూ? అంటూ ప్రశ్నించారు.
అప్పట్లో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడాలు. దిశానిర్దేశాలుండేవని... అంతా తమరే చేస్తున్నట్టు బిల్డప్పులుండేవని ఆరోపించారు. విరుచుకు పడ్డట్టు, రంకెలేసినట్టు ఎల్లో మీడియా డప్పుకొట్టేదని ఎద్దేవా చేసారు. ఇక కరోనా సమయంలో విజయసాయి రెడ్డి చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు చర్చకు రావాలని విజయసాయి రెడ్డి సవాల్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అంటూ సీఎం జగన్ గారు అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నావా బాబూ? అప్పట్లో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడాలు. దిశానిర్దేశాలుండేవి. అంతా తమరే చేస్తున్నట్టు బిల్డప్పులుండేవి. విరుచుకు పడ్డట్టు, రంకెలేసినట్టు ఎల్లో మీడియా డప్పుకొట్టేది.
— Vijayasai reddy v (@VSReddy_MP) May 21, 2020