తెలంగాణాలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు మందు బాబులు మద్యం షాపులకు బారులు తీరుతున్నారు. తాజాగా రాష్ట్రంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ లో ఇద్దరు మహిళలు పోలీసులపై దాడికి దిగారు. వికారాబాద్ లో కల్లు అమ్మకం విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. 

 

దీనితో సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు అక్కడికి వెళ్ళారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేసారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. కాని వాళ్ళు వినలేదు... తమకు ఏదో అన్యాయం జరుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖ పోలీసులపై ఇద్దరు ముగ్గురు మహిళలు దాడులకు దిగారు. దీనితో వారి మీద కేసులు నమోదు చేసారు. ఈ ఘటనపై పిఎస్ లో ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: