పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం కరాచి విమానాశ్రయం వద్ద కుప్ప కూలింది. లాహోర్ నుంచి కరాచి వస్తున్న విమానం కరాచి విమానాశ్రయం వద్ద కుప్ప కూలిపోయింది. ఈ విమానంలో 200 మంది ఉండగా ఇప్పటి వరకు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

 

లాక్ డౌన్ తర్వాత పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా విమానాలను నడుపుతుంది. ఈ నేపధ్యంలోనే విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎక్కువగా విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంత మంది మరణించారు అనేది తెలియడం లేదు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: