ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ బిల్లుల విషయంలో ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పేదలను పీల్చి పిప్పి చేస్తుందని, పాత స్లాబుల ప్రకారమే విద్యుత్ చార్జీలను వసూలు చెయ్యాలని తెలుగుదేశం పార్టీ దీక్షలు చేస్తుంది ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తుంది. ఈ నేపధ్యంలో దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

 

కరెంటు బిల్లులపై పచ్చ పార్టీ దీక్షలను చూసి దేశమంతా నవ్వుతోందని ఎద్దేవా చేసారు. జాతీయ మీడియా, సోషల్ మీడియాలు వాటిని దీక్షలు అనలేమని తేల్చాయన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నిరశన కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే, ప్రజల కోసం కాకుండా ఎల్లో మీడియా కవరేజి కోసం తాపత్రయ పడినట్టు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: