ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీలో 47 మందికి కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2561 కేసులు నమోదు అయ్యాయి. 56 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇప్పటి వరకు 1778 మంది కరోనా  నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో 5 కేసులకు కోయంబేడు లింక్ లు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇప్పుడు 727 మంది కరోనా తో పోరాటం చేస్తున్నారు. మరణాలు తక్కువ రికవరీ రేటు ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ప్రస్తుతం ఏపీలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: