లాక్ డౌన్ ఉన్నా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైళ్లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రైల్వే శాఖ ప్రయాణికులకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. భారతీయ రైల్వే... జూన్ ఒకటో తేదీ నుంచి 200 రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిల్లో 30 ఏసీ ట్రైన్స్‌కు ఏడు రోజులకు మాత్రం అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చారు. 

 

ఇప్పుడు దానిని 30 రోజులకు  పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు ఒక ప్రకటనలో రైల్వే శాఖ తెలిపింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా కన్ఫామ్ కాని వారు ప్రయాణించేందుకు వీలు లేదని ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: