దేశ వ్యాప్తంగా రాబోయే రెండు మూడు వారాలు కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ఎవరూ కూడా బయటకు రావొద్దని దాని వలన ఇబ్బందులు మినహా మరొకటి లేదని రైలు బస్సు సర్వీసులను అవసరం అయితే మినహా వాడుకోవద్దు అని సూచనలు చేస్తున్నారు. 

 

ఎవరికి వారు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండటం మంచిది అని అసలు పరిస్థితి బాగా లేదు అని మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు అవసరం ఉంటేనే వెళ్ళాలి అని, విమాన సర్వీసులకు అనుమతులు వచ్చినా దయచేసి వెళ్ళవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని కాబట్టి ప్రజలు సహకరించి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండటమే మంచిది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: