సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎలాంటి సమస్యలకైనా ఒక పరిష్కారం చూపుతుందనే నా నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. డిజిటల్ మహానాడు జరుగుతున్న నేపధ్యంలో ఆయన ట్వీట్ చేసారు. 

 

లాక్ డౌన్ కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే డిజిటల్ సోషలైజేషన్ దిశగా మనం వెళ్ళామంటే దానికి కారణం సాంకేతికత అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020 కూడా అలాంటిదే అన్నారు. ప్రతి ఏడాది అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా జరుపుకునే మహానాడుకు ఈసారి లాక్ డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయన్నారు. 

 

అయితేనేం జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపిందన్నారు ఆయన. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం మన మహానాడు 2020 అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా మీ మొబైల్ లేదా ట్యాబులలో జూమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మే 27, 28 తేదీలలో జరిగే ఈ డిజిటల్ మహానాడులో పాల్గొనాలని కోరారు. ప్రతి మహానాడు మాదిరిగానే ఈ మహానాడుని  కూడా విజయవంతం చేయండని విజ్ఞప్తి చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: