లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు.. చాలా మందికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది దేశం లో. కుటుంబాలను పోషించలేని స్థితిలో ఉన్నారు చాలా మంది. దీనితో ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా తెలంగాణాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. 

 

ఒక వ్యక్తి కన్న తల్లిని పోషించలేక  హత్య చేస్తే పాతబస్తీలో... సయ్యద్ అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత మంది వ్యాపారాలు కూడా తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు రోడ్డున కూడా పడ్డారు. వీరు అందరూ కూడా ఇప్పుడు ముందుకు ఏ విధంగా వెళ్ళాలో అర్ధం కాక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: