సిద్ధిపేట నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు చేయనున్నారు. ఈ నెల 29 న ఆయన ఏకకాలంలో యాగాలు చేయనున్నారు. ఎల్లుండి ఉదయం ఏడు గంటలకు కొండ పోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారు. అదే సమయంలో చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు చేస్తారు కేసీఆర్. చండీయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. 

 

అనంతర౦ కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ ని కేసీఆర్ దంపతులు ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు ఎర్రవెల్లి మర్కుక్ లో రైతు వేదికలకు ఆయన శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్ తో కేసీఆర్ ఫోన్ లో కూడా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: