ఎప్పుడు ఎవరితో ఒకరితో ఏదోక కయ్యం పెట్టుకునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ట్విట్టర్ తో పెట్టుకున్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్ పై ట్రంప్ చేసిన రెండు ట్వీట్ లు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్ చేసింది మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా మోసం చేయటానికి లేదని ఖచ్చితంగా చెప్పలేమని... మెయిల్ బాక్సులను దొంగిలించవచ్చని... బ్యాలట్లను ఫోర్జరీ చేయవచ్చని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా వాటిని ప్రింట్ అవుట్ తీయవచ్చన్నారు. దొంగ సంతకాలు కూడా చెయోచ్చని పేర్కొన్నారు. కాలిఫోర్నియా ప్రభుత్వం మిలియన్ల మంది ప్రజలకు బ్యాలట్లను పంపిస్తోందా? అని నిలదీశారు.
దీనిపై ట్విట్టర్ నిజ నిర్ధారణ చేసింది. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా రిగ్గింగ్కు ఆస్కారం ఉందంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేశారని పేర్కొన్నారు. ఏది ఎమైనప్పటికి మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా ఓటర్లు మోసాలకు పాల్పడే అవకాశం లేదని మా నిజ నిర్థారణ నిపుణులు తేల్చారని పేర్కొంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్విటర్ జోక్యం చేసుకుంటోందన్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్పై నేను చేసిన వ్యాఖ్యలు అవినీతి, మోసాలకు ఆస్కారమిస్తాయని అంటోందని... అది ముమ్మాటికి తప్పని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
.@Twitter is now interfering in the 2020 Presidential Election. They are saying my statement on Mail-In Ballots, which will lead to massive corruption and fraud, is incorrect, based on fact-checking by Fake news CNN and the amazon Washington Post....
— Donald J. trump (@realDonaldTrump) May 26, 2020