ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న నీలం సహాని పదవీ కాలాన్ని పోడిగించాలి అని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేసారు. ఆమె పదవీ కాలం జూన్ 30 తో ముగుస్తుందని కాబట్టి ఆ పదవీ కాలాన్ని డిసెంబర్ వరకు అంటే మరో ఆరు నెలల పాటు పెంచాలని ఆయన కోరారు.
కాగా ఆమె సర్వీసు కూడా జూన్ 30 తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఆమెకు సమర్ధవంతమైన అధికారిగా పేరుంది. సిఎం జగన్ కి ఆమె కష్ట కాలంలో తన పని తీరుతో అండగా నిలిచారు. నమ్మకమైన అధికారిగా కూడా ఆమెకు మంచి పేరు ఉంది.