ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖపై నేడు సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరోగ్య శ్రీ కోటి 42 లక్షల మందికి వర్తింపజేస్తామని జగన్ అన్నారు. అదే విధంగా మరిన్ని హామీలు కూడా జగన్ ఇచ్చారు. 

 

ఇక‌పై ప్ర‌తిసారి ప‌రీక్ష.. టెస్టుల రిపోర్టులు అక్క‌ర్లేదన్నారు ఆయన. ఆరోగ్య కార్డులో ఉన్న క్యూ ఆర్ కోడ్‌తో అన్ని టెస్టుల రిపోర్టులు తెలుసుకోవ‌చ్చని చెప్పారు. ఇక‌పై టెస్టుల రిజ‌ల్ట్ ఆ కోడ్‌లో పెడ‌తారన్నారు. ఇక నుంచి 5 లక్షల ఆదాయం ఉన్న అందరికి ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: