కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు భారత ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. వారిని ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు భారత బలగాలు. రోజు రోజుకి వారిని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరి వేయడానికి గానూ ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో నిఘా వర్గాల సహకారం తో చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. 

 

నిఘా వర్గాల సమాచారం తో కాల్పులకు దిగాయి భారత బలగాలు. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీస్, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాలింపు చర్యల్లో భారత బలగాలు పాల్గొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: