దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఆగడం లేదు. వేల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు ప్రతీ గంటా కూడా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయి. 

 

ఇక ఇప్పుడు గుజరాత్ తమిళనాడు మహారాష్ట్రలో వేల కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ఆ మూడు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా లాక్ డౌన్ ని పెంచే విధంగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఆ రాష్ట్రాలను పూర్తిగా మూసి వేసే ఆలోచనలో ఉంది కేంద్రం అని అంటున్నారు. సరిహద్దులను పూర్తిగా మూసి వేసే ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: