కర్నూలు జిల్లాలో వజ్రాల వేట సందడి మొదలయింది. తొలకరి వస్తుంది అంటే చాలు అక్కడి ప్రజలు వజ్రాల కోసం వేటాడుతూ ఉంటారు. వారం రోజుల క్రితం తుగ్గిలి మండలం పగిడిరాయి బొల్లవానిపల్లె పొలాల్లో రెండు వజ్రాలు దొరికాయి. ఒక వజ్రం బొల్లవానిపల్లె పొలాల్లో గొర్రెల కాపరికి దొరికింది. 

 

దీనిని రూ.50 వేలు, రెండు తులాల బంగారానికి వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక పగిడిరాయిలో వ్యవసాయ కూలీకి కూడా ఒక వజ్రం దొరికగా... రూ. లక్షా 50 వేలకు జొన్నగిరికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసారని తెలుస్తుంది. తలఒకరికి ఇలా వజ్రాలు దొరకడంతో... అక్కడి ప్రజలు ఇప్పుడు వజ్రాల కోసం పెద్ద ఎత్తున వేటాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: