దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి వేల కేసులు నమోదు కావడం తో ఇప్పుడు ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. కరోనా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఇప్పట్లో అయితే దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే... 

 

ఇప్పుడు దేశానికి వైద్యులు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. నిన్న ఒక్క రోజే దాదాపు 5 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయ్యారట. ఇక మరణాలు కూడా కేవలం చాలా తక్కువగా ఉన్నాయి అనేది చాలా మంది చెప్పే మాట. లెక్కలు కూడా అదే విషయాన్ని నిజం అంటున్నాయి. 3 శాతంలోపే మరణాలు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: