ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత వాహన మిత్ర కార్యక్రమాన్ని సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దాదాపు 2 లక్షల 63 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసింది. ప్రతీ ఒక్కరికి మంచి జరగాలి అనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని సిఎం వైఎస్ జగన్ అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

వాహన మిత్ర రాని వారు, అర్హత ఉండి స్పందన యాప్ లో నమోదు చేసుకోవాలని జగన్ చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత ఆర్ధిక సహాయం నాలుగు నెలల ముందుగానే చేసారు. దీనిపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కి ధన్యవాదాలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: