విజయవాడ విద్యుత్ సౌదాలో ఇప్పుడు కరోనా దెబ్బకు అందరూ కూడా షేక్ అవుతున్నారు. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. గుణదల విద్యుత్ సౌధా కార్యాలయ సమూహంలోని విజయవాడ జోనల్ కార్యాలయంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చింది అని తెలియడంతో అతని సహా ఉద్యోగులు 22 మంది సిబ్బందిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి అంటూ అధికారులు సూచించారు. 

 

అదే విధంగా వారు తమకు కరోనా పరిక్షలు చెయ్యాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయం అంతా శానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని, భౌతిగా దూరం పాటించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 500 మంది ఇంజినీర్లు, ఇతర సిబ్బంది విధులలో ఉంటారు. వెంటనే శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: