దిగ్గజ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్ అధినేత, మూవీ మొఘల్ రామానాయుడు జయంతి నేపధ్యంలో సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయనను స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. హీరోలు హీరోయిన్ లు ఇతర నటీ నటులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఆయన జయంతికి గాను నివాళులు అర్పిస్తున్నారు. 

 

ఇక తాజాగా సురేష్ ప్రొడక్షన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఆయనను స్మరించుకుంది. మా స్థాపకుడు, ఇండియన్ సినిమా మొఘల్, డాక్టర్ డి. రామానాయుడు గారిని గుర్తు చేసుకుంటున్నాం అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో ఆయన దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది సురేష్ ప్రొడక్షన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: