ఆళ్లగడ్డలో అఖిల ప్రియపై పోటీ చేస్తా అని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి కీలక ప్రకటన చేసారు. అఖిల ప్రియను అక్కా అనాలి అంటేనే అసహ్యంగా ఉందన్నారు ఆమె. తమది ఆళ్ళగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని, స్వాగతించటానికి అఖిలప్రియ ఎవరు? అని ప్రశ్నించారు. దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోనని, ఆడపిల్లగా నాన్న లేని  పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. భూమా దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి 30ఏళ్ళ కష్టం వలనే అఖిలప్రియకు ఆ స్థాయి దక్కింది అంటూ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: