గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడంతో మిగిలిన వారిని క్యాంపు కి తరలిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. 24 గంటల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.

 

 మరో ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు దిగింది. శనివార౦ ఉదయం ఎమ్మెల్యేలను రిసార్ట్ కి తరలిస్తుంది. 65 మంది ఎమ్మెల్యేలను అధిష్ఠానం గుజరాత్‌లోని రిసార్టులకు తరలించింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరి రాజీనామా చేసారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే బ్రిజేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: