కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు అక్కడ పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. కరోనా కట్టడిలో అక్కడి ప్రభుత్వం ఎంత సమర్ధవంతంగా వ్యవహరించినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు అని అంటున్నారు. ఇక తాజాగా అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

 

కర్ణాటక నిన్న సాయంత్రం 5 నుండి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 378 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3184 క్రియాశీల కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. మొత్తం కేసుల సంఖ్య 5213 కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 59 అని అక్కడి ప్రభుత్వం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: