వాహనాల విషయంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఆసక్తి గురించి అందరికి తెలిసిందే. అతనికి ఎన్నో బైక్స్ అలాగే కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు వచ్చే కొత్త వాహనాలను అతను కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా అతను ట్రాక్టర్ ని కొనుగోలు చేసాడు.
ట్రాక్టర్ ఎందుకు అంటారా...? తన పొలం లో సేంద్రీయ వ్యవసాయం చేయడానికి గానూ ఈ ట్రాక్టర్ ని అతను కొన్నట్టు తెలిపారు. ధోని తన గ్యారేజీకి కొత్త చేరికను కలిగి ఉన్నాడు. అతను ఇటీవల కొత్త ఎరుపు రంగు మహీంద్రా స్వరాజ్ 963 ఎఫ్ఇ ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. ట్రాక్టర్ చాలా శక్తివంతమైనదని దీని ధర సుమారు 8 లక్షలు అని జాతీయ మీడియా పేర్కొంది.
Anand mahindra Comments about MS Dhoni's New Beast in his Farm!https://t.co/l1ZxYLwH1I
— Behindwoods (@behindwoods) June 7, 2020