ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వలస కార్మికులకు చేస్తున్న సేవపై ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆయనను కొనియాడుతుంది. ఇలాంటి తరుణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం తీవ్ర విమర్శలు చేసారు. ఆయన త్వరలోనే ప్రధాని మోదీని కలిసి... ‘సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ గా అయిపోతారని సామ్నాలో రౌత్ ఆరోపణలు చేసారు. కొత్త మహాత్ముడు ఊడిపడ్డాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
గవర్నర్ కోషియారీ కూడా ‘మహాత్మా సూద్’ అని ప్రశంసించారని లాక్డౌన్ సమయంలో సూద్ లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారన్న ఆయన.. లాక్డౌన్ సమయంలో అన్ని బస్సులను ఎలా అందుబాటులోకి తెచ్చారో ఎవరూ ఆయన్ను ప్రశ్నించలేదని నిలదీశారు. దీని వెనుక కచ్చితంగా ఎవరో రాజకీయ నాయకుడు ఉన్నారని ఆయన అన్నారు.